ముంబై, మార్చి 28: వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ తిరిగి బలపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పాలకపక్షంతో పాటు, బలమైన ప్రతిపక్షం అవసరమని పేర్కొన్నారు. దేశస్థాయిలో కాంగ్రెస్ బలహీనపడితే, ప్రతిపక్ష స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు తీసుకుంటాయని, ఇది మంచి సంకేతం కాదని అన్నారు.