శాలిగౌరారం: జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టులోకి 18అడుగుల నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రామన్నపేట మండలం పల్లివాడ హెడ్వర్క్ నుంచి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగౌరారం ప్రాజెక్టులోకి రాచ కాల్వ ద్వారా నీరు వచ్చి చేరుతోంది.
నీటి ప్రయాణ మార్గంలోని పదుల సంఖ్యలో చెరువులు, కుంటలను నింపుకుంటూ శాలిగౌ రారం ప్రాజెక్టులో కలుస్తాయి. ప్రాజెక్టు నీటి మట్టం 21అడుగులు కాగా సోమవారం నాటికి 18అడుగులు చేరింది. ప్రస్తుతం వానకాలం సాగుకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయటక్టు కింద 6వేల ఎకరాల్లో భూములు సాగులోకి వస్తున్నాయి.