ముంబై: ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో నైజీరియాకు చెందిన నల్లజాతి వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పాదాచారులపై జరిపిన దాడిలో 8 మంది గాయపడ్డారు. పారిస్ వెల్ వద్ద ఉన్న టాటా గార్డెన్ దగ్గర ఈ ఘటన జరిగినట్లు ఏసీపీ దిలీప్ సావంత్ తెలిపారు. కత్తితో దాడికి దిగిన వ్యక్తిని 50 ఏళ్ల జాన్గా గుర్తించారు. ఓ మహిళతో ఉన్న అతను అకస్మాత్తుగా తన జేబులో ఉన్న కత్తిని తీసి అటుగా వెళ్తున్న పాదాచారులపై దాడి చేశాడు. ఈ దాడిలో 8 మంది వరకు గాయపడ్డారు. దాంట్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి అతన్ని అరెస్టు చేశారు. దాడి ఘటన జరిగిన రోడ్డు వద్ద రక్తపు మరకలు ఉన్నాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తీసుకువెళ్లారు.