బెజ్జంకి, అక్టోబర్ 27: గుర్తుతెలియని వ్యక్తులు రెండు రోజుల వయస్సున్న పసికందును ముళ్లపొదల్లో పడేసిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో చోటుచేసుకున్నది. బుధవారం ఉదయం తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ వైపు వెళ్లిన స్థానికులకు కాలువలోని ముళ్లపొదల్లో నుంచి పసికందు అరుపులు వినిపించాయి. వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించగా ఆడశిశువు కనిపించింది. పాపకు చిన్నపాటి గాయాలు కావడంతో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు.