హైదరాబాద్, ఆట ప్రతినిధి: భాగ్యనగరం మరో ప్రతిష్ఠాత్మక క్రీడా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల తొలిసారి జరుగుతున్న గూంచా సీనియర్ హాకీ టోర్నమెంట్కు మహానగరం వేదికైంది. జవహర్లాల్ నెహ్రూ హాకీ టోర్నమెంట్ సొసైటీ (జేఎనన్హెచ్టీఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీని ఆదివారం రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. గూంచా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇందర్ మోహన్ కపూర్ స్మారకార్థం సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పది రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 14 జట్లు.. 22 మ్యాచ్లు ఆడనున్నాయి. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జయేశ్ రంజన్తో పాటు గూంచా గ్రూప్ ఈడీ యశ్ భర్వానీ తదితరులు పాల్గొన్నారు.