హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ) : డిండి లిఫ్ట్ స్కీమ్ పనులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని, ఇది తగదని సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ పేర్కొన్నారు. డెడ్లైన్ దాటినా ప్రాజెక్టు పనులు ముందుకు కదలడం లేదని, దీంతో నల్లగొండ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు.
48గంటల్లో పోతిరెడ్డిపల్లి బరాజ్ నిర్మాణానికి అనుమతులివ్వకుంటే నల్లగొండ కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.