న్యూఢిల్లీ: ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, సంబంధిత వర్గాలకు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్తో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
పలు శస్త్రచికిత్సలు చేసేందుకు ఆయుష్ ప్రాక్టీషనర్లకు అనుమతులు ఇవ్వడంపై అలోపతిక్ ప్రాక్టీషనర్లు దాఖలు చేసిన పిటిషన్తో పాటు తాజా పిటిషన్ను కూడా విచారిస్తామని పేర్కొంది. ‘ఒకవైపు అలోపతిక్ వారితో సమానంగా శస్త్రచికిత్సలు చేస్తామంటారు.
మరోవైపు నీట్ రాయమంటే వారితో సమానం కాదంటారు. ఇది ద్వంద్వ వైఖరి కాదా?’అంటూ ఆయుష్ ప్రాక్టీషనర్లను ప్రశ్నించింది.