కొత్తపల్లి/తెలంగాణచౌక్, మార్చి 17: నిరుద్యోగ యువత ఎలాంటి వదంతులు నమ్మకుండా పోటీపరీక్షలకు సంసిద్ధులు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, శాతవాహన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ నెల 20న నగరంలోని శుభం గార్డెన్స్లో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్ను గురువారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ఎకడా లేని విధంగా ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన వెలువరించారని, నిరుద్యోగ యువత ఎలాంటి వదంతులు నమ్మకుండా పోటీ పరీక్షలకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించడంపై సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్గౌడ్, హన్మంతు నాయక్, ఇతర గ్రూప్-1 అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, కలెక్టర్ కర్ణన్, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మల్లేశ్ సంకశాల, తదితరులు పాల్గొన్నారు.