కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా.. 292 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. ఫలితాల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్న విధంగా సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 141 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 138 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాల కూటమి 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నందిగ్రామ్ నియోజకవర్గంలో సీఎం, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో సువేందుకు 7,287 ఓట్లు.. మమతకు 5,790 ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా.. టాలీగంజ్లో బీజేపీ నేత, కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజలో ఉన్నారు. 9,900 ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు.