న్యూఢిల్లీ: అఖిలేశ్ యాదవ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. బీజేపీ నేత నుపుర్ శర్మపై విద్వేష పూరిత, అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తన లేఖలో మహిళా కమిషన్ పేర్కొన్నది. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు క్లాస్ పీకిన విషయం తెలిసిందే. ఆమె నోరు జారడం వల్ల దేశంలో ఉదయ్పూర్ లాంటి ఘటనలు జరిగినట్లు సుప్రీం పేర్కొన్నది. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. సమాజ్వాదీ నేత అఖిలేశ్ యాదవ్ ఇటీవల ఓ ట్వీట్ చేశారు. నుపుర్ ముఖం మాత్రమే కాదు, ఆమె శరీరం కూడా క్షమాపణ చెప్పాలని, దేశంలో శాంతికి భంగం కలిగించిన ఆమెను శిక్షించాలని అఖిలేశ్ యాదవ్ తన ట్వీట్లో తెలిపారు. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. ఈ నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా వర్మ .. యూపీ డీజీపీ డీఎస్ చౌహాన్కు లేఖ రాసింది. నుపుర్పై అఖిలేశ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని రేఖా శర్మ తన లేఖలో తెలిపింది. ప్రస్తుతం ఈ విషయంపై ఉన్న గాఢతను గమనించి, తక్షణమే అఖిలేశ్పై చర్యలు తీసుకోవాలని కోరింది. మూడు రోజుల్లోగా ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.