ప్రముఖ సినీ నటులు కృష్ణంరాజు (krishnam raju) మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని నివాసంలో నివాళుర్పిస్తున్నారు. కృష్ణంరాజు మృతి పట్ల ఎన్బీకే 107 (Nbk 107) టీం విచారం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం టర్కీలో ఉన్న చిత్రయూనిట్ కృష్ణంరాజు మృతికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితోపాటు చిత్రబృందం కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు.
Team #NBK107 mourns the untimely demise of Shri. #KrishnamRaju garu at the shooting spot in Turkey!
The team also expressed their deep grief & sends out hearty condolences to the family at the time of sorrow. @shrutihaasan @MeGopichand @MythriOfficial pic.twitter.com/E6VLgOLG5B
— BA Raju's Team (@baraju_SuperHit) September 11, 2022
బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ నటుడు ధునియా విజయ్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత