హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇంటర్నేషనల్ జూనియర్ బ్యాడ్మింటన్ సిరీస్లో నవ్య కందేరి చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన అండర్-19 బాలికల ఫైనల్లో నవ్య 21-15, 21-18తో ఇషారాణిపై గెలుపొందింది.
అండర్-19 బాలుర సింగిల్స్ ఫైనల్లో జస్టిన్ (మలేషియా) 21-18, 21-14తో ప్రణయ్ శెట్టిగర్పై నెగ్గి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ముగింపు వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జాతీయ బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేతలకు బహుమతులు అందజేశారు.