నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 25 : జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై అధికారులు అవగాహన కల్పించారు. 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. అర్హులందరూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధు ఆధ్వర్యంలో ర్యాలీలు తీసి, ప్రతిజ్ఞ చేశారు.