హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. స్థానిక ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న టోర్నీలో గురువారం జరిగిన సబ్ జూనియర్ 53కిలోల విభాగంలో గుజరాత్ లిఫ్టర్ రాహుల్ సాహూ 380కిలోల బరువెత్తి పసిడి పతకంతో మెరిశాడు. ఇదే విభాగంలో సర్వేశ్(372.50, మహారాష్ట్ర), యోగేశ్(362.50, తమిళనాడు) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. 59కిలోల కేటగిరీలో అరుణ్, రోహిత్ కుమార్, దీపాంశు వరుసగా టాప్-3లో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న టోర్నీని తెలంగాణ పవర్లిఫ్టింగ్ కమిటీ ఉపాధ్యక్షురాలు రాజేశ్వరీ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.