Malnutrition | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): పేద, మధ్యతరగతి వర్గాలకు పోషకాహారం అత్యంత భారంగా మారుతున్నది. తక్కువ ఆదాయం కలిగిన దేశాలతోపాటు మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువమంది పేద, మధ్య తరగతి వర్గాలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రముఖ పరిశోధన సంస్థ జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
మొత్తం 26 అధ్యయనాలను విశ్లేషించిన తర్వాత 20 రకాల న్యూట్రిషన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఆహార ఆధారిత, న్యూట్రిషనల్ సప్లిమెంట్లు, గర్భిణుల పోషకాహారం, చిన్నారుల పోషకాహారం వంటి సమస్యలపై పరిశోధనల్లో గుర్తించారు. అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ వినియోగాన్ని పెంచడంలో అంతర్జాతీయంగా ప్రత్యేక విధివిధానాలు అవసరం ఉన్నాయని, ముఖ్యంగా ఎన్సీడీ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందేనని అధ్యయనం తేల్చింది.