మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 26: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా డిసెంబర్ 11న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు మొదటి అదనపు జిల్లా జడ్జి రఘరాం తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కోర్టు న్యాయసేవ సదన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 11న మహబూబ్నగర్ జిల్లా కోర్టుతో పాటు జిల్లాలోని అన్ని తాలూకా కోర్టుల్లో కూడా మెగా లోక్ అదాలత్ను నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదాలత్కు రావడం వల్ల కోర్టు ఫీజు ఉండదని, అంతేకాక తుది తీర్పు ఇవ్వడం జరుగుతుందని, అప్పీలు ఉండదని సాధ్యమైనంత ఎక్కువ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్. వెంకటరామన్, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. సంధ్యారాణి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీదేవి, జ్యుడీషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కిరణ్ కుమార్, ఎక్సైజ్ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతు పాల్గొన్నారు.