హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఎన్టీపీసీ సదరన్ రీజినల్ ఈడీగా నరేశ్ ఆనంద్ సోమవారం హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)లో సభ్యుడిగా పనిచేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆనంద్.. 1984లో ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఎన్టీపీసీలో తన కెరియర్ను ప్రారంభించారు.