కేదార్నాథ్: రానున్న 10 ఏండ్లలో ఉత్తరాఖండ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగం కోసం వలస వెళ్లడం తప్పుతుందని చెప్పారు. కేదర్నాథ్లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని శుక్రవారం మోదీ ప్రారంభించారు. శంకరాచార్య భారీ విగ్రహాన్ని ఆవిష్క రించారు. దేశంలోని పురాతన ఆలయాల పునర్నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. కేదార్నాథ్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.