ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 10: తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేందర్రెడ్డి ఎన్నికయ్యారు. అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం నిర్వహించారు. ఈసమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ పి.జీవన్, డాక్టర్ వీరూ యాదవ్, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ ధాత్రిక స్వప్న, డాక్టర్ మాగి వెంకట్, డాక్టర్ కె.రవితేజ, డాక్టర్ ఓరుగంటి కృష్ణ, డాక్టర్ ప్రకాశ్రెడ్డి, కోశాధికారిగా డాక్టర్ రవీందర్గౌడ్, కార్యదర్శులుగా డాక్టర్ తిరుపతి, డాక్టర్ రేష్మ, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ షరీఫ్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ గంగాధర్, ముఖ్య సలహాదారులుగా డాక్టర్ రమణారావు, డాక్టర్ కడియం రాజు, డాక్టర్ తిరుపతి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరేట్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో అధ్యాపక
పోస్టులను భర్తీ చేసి, నిరుద్యోగులైన డాక్టరేట్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.