యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 వ తేదీ శుక్రవారం నుంచి 14 వ తేదీ సోమవారం వరకు పదకొండు రోజుల పాటు కొనసాగనున్న్నాయి.
సవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారం బాలాలయం నందు బ్రహ్మోత్సవాలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.గీత ఒక ప్రకటనలో తెలిపారు.
10 తేదీ గురువారం రాత్రి 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం, 11వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 12 వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు స్వామి వారి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారని ఏవో తెలిపారు. ఉత్సవాలన్నీ బాలాలయం నందు కొవిద్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తామని ఏవో గీత తెలిపారు.