మోటకొండూర్, డిసెంబర్ 17: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, అయినప్పటికీ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శనివారం మోట కొండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుట్ల కమలాదేవీరామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ ఆరుట్ల సుశీల సహకారంతో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రీడలను ఆమె స్థానిక సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఆరుట్ల కమలాదేవీరామచంద్రారెడ్డి ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్నారు. క్రీడా పోటీలను పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడల్లో రాణించిన వారికి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ సుశీల, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశ్గౌడ్, ఎంపీటీసీ అంజిరెడ్డి, నిర్వాహకులు రఘురాంరెడ్డి, స్టాలిన్బాబు, వినోద్కుమార్ ఉన్నారు.