మిర్యాలగూడ, డిసెంబర్ 16 : ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ప్రజలకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని 48వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ నల్లాలకు బిగించిన ట్యాప్లను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరందించాలన్న సంకల్పంతో వేల కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. నీరు వృథా కాకుండా ప్రజావసరాలకు అనుగుణంగా నల్లాలు నిర్మిస్తున్న మున్సిపల్ పాలకులు, ఆధికారులను అభినందించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని స్థానికులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రవిష్ణు, మున్సిపల్ కమిషనర్ రవీందర్సాగర్, డీఈ సాయిలక్ష్మి, కౌన్సిలర్లు కుర్ర చైతన్య, జావీద్, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు నూనె రవికుమార్, నాయకులు నవీన్, నాగుల్మీరా, వెంకన్న, వెంకటేశ్వర్లు, సైదులు, తిరుపతమ్మ పాల్గొన్నారు.
దుర్గమ్మకు ఎమ్మెల్యే నివాళి
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన సీపీఎం మండల నాయకుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు మాతృమూర్తి దుర్గమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గ్రామానికి వెళ్లి దుర్గమ్మ మృత దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లును పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ దొండరామరాజు, అలెగ్జాండర్, ఎంపీటీసీ టీ సైదులు, మాజీ ఎంపీటీసీ లింగయ్య, శాబొద్దీన్, బీఆర్ఎస్ గ్రామ శాఖాధ్యక్షుడు వీరయ్య, నాయకుడు మట్టయ్య పాల్గొన్నారు.