పాలకవీడు, మార్చి1 : దాహం తీర్చుకునేందుకు వెళ్లి వ్యవసాయ బావిలో పడి యువతి మృతి చెందింది. మండలంలోని జాన్పహాడ్ దర్గా గ్రామ శివారులో మంగళవారం ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన షేక్ పర్వీన్ (28) అనారోగ్యంతో బాధపడుతుండడంతో స్వస్థత కోసం తల్లి గౌసియాతో కలిసి గురువారం సైదులు బాబా దర్గాకు వచ్చి అక్కడే ఉంటుంది. సోమవారం సాయంత్రం నీళ్లు తాగి వస్తానని తల్లికి చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లి ఎంత వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం దర్గా సమీపంలోని వ్యవసాయ బావిలో కూలీలు యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ఫర్వీన్దిగా గుర్తించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.