రామగిరి, మే 25 : హనుమాన్ జయంతి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తెల్లవారు జామునుంచే ఆలయాలకు తరలివచ్చి పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని తులసీనగర్ భక్తాంజనేయస్వామి దేవాలయంలో 108 కలశాలతో అభిషేకాలు నిర్వహించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి హాజరై పూజలు చేశారు.
ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నేలపట్ల రమేశ్, మేనేజర్ రుద్ర వెంకటేశం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన సుబ్రహ్మణేశ్వరస్వామి దేవాలయాన్ని ప్రారంభించారు. వీటీకాలనీ సెంటర్లోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.
హాలియా : హాలియాలోని సీతారామాంజనేయుస్వామి ఆలయంలో స్వామి వారికి పంచామృతాభిషేకం, 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే నోముల భగత్ మాతృమూర్తి నోముల లక్ష్మి, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మా శంకరయ్య, రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం హాలియాలో స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు. ఎస్ఐ క్రాంతికుమార్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయప్రోలు మురళి, అర్చకులు రమణశర్మ పాల్గొన్నారు.
కట్టంగూర్(నకిరేకల్) : పట్టణంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ నాయకులు యానాల లింగారెడ్డి పూజలు చేశారు.
చిట్యాల : వెలిమినేడు ఆంజనేయస్వామి దేవాలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, రక్త బంధనం, అష్టోత్తర కలశపూజ, అగ్నిప్రతిష్ఠాపన నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, దేవాదాయ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ దేశబోయిన మల్లమ్మాపాపయ్య, ఎంపీటీసీ స్వరూపానర్సింహ, సత్తిరెడ్డి, ఆలయ అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.
నార్కట్పల్లి : మండల కేంద్రంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు గుండెపూడి జానకిరామశర్మ, పసునూరి శ్రీను, దయాకర్, దుబ్బాక శ్రీధర్, బండారు శ్రీను, రాంబాబు పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల కేంద్రంలోని పావురాలగూడెంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
త్రిపురారం : మండలంలోని త్రిపురారం, అంజనపల్లి గ్రామాల్లోని ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. త్రిపురారంలో మహాన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచులు అనుముల శ్రీనివాస్రెడ్డి, అవిరెండ్ల వీరయ్య, పూజారులు నరేంద్రరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్, మే 25 : మండలంలోని తుంగపహాడ్ గ్రామంలో 36 అడుగుల భారీ హనుమంతుడి విగ్రహాన్ని బుధవారం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా సామాజిక వేత్త బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మచ్చ నాసమ్మ, మాజీ సర్పంచ్ సజ్జల శ్రీనివాస్రెడ్డి, కంచుగట్ల లింగయ్యయాదవ్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.