కట్టంగూర్(నకిరేకల్), అక్టోబర్ 29 : దేశమంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్లోని సువర్ణ గార్డెన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వల్లే రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారని, ఈ కష్ట కాలంలో దేశాన్ని కాపాడే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పీఠం కదిలేలా నవంబర్ 15న వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే విజయగర్జనకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మండలాధ్యక్షుడు నవీన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నకిరేకల్, చిట్యాల మున్సిపల్ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్, కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, ఎంపీపీలు కొలను సునీతావెంకటేశం, సూదిరెడ్డి నరేందర్రెడ్డి, కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేశ్, తరాల బలరాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి, పీఏసీఎస్ చైర్మన్లు నూక సైదులు, పల్రెడ్డి మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, ఊట్కూరి ఏడుకొండలు, బైరెడ్డి కరుణాకర్రెడ్డి, మారం భిక్షంరెడ్డి, ఆవుల అయిలయ్య, ఉదయ్రెడ్డి, సీనియర్ నాయకులు చింతల సోమన్న, టీఆర్ఎస్ చిట్యాల, నకిరేకల్ పట్టణ అధ్యక్షులు పొన్న లక్ష్మయ్య, యల్లపురెడ్డి సైదిరెడ్డి సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.