చిట్యాల, అక్టోబర్ 29 : మండల కేంద్రంలో 100కిలోల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ శంకర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్ఐ రావుల నాగరాజు పట్టణ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరానికి చెందిన కుర్ర సహదేవ్ బొలెరో వాహనంలో 100 కిలోల గంజాయిని హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుకొని వాహనాన్ని సీజ్ చేశారు. తాసీల్దార్ కృష్ణారెడ్డి సమక్షంలో పంచనామా చేసి కేసు దర్యాప్తు చేసినట్లు సీఐ తెలిపారు.
దేవరకొండలో 23 కిలోలు..
దేవరకొండ : గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఆనందరెడ్డి తెలిపారు. పట్టణ సమీపంలోని మోడల్ స్కూల్కు వెళ్లే దారి పక్కన పలువురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారంతో ఎస్ఐ నారాయణరెడ్డి సిబ్బందితో తనిఖీ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా రెండు బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కామారెడ్డి జిల్లాలోని కొడంగల్ మండలం పోచారంతండాకు చెందిన తారాసింగ్, సంగారెడ్డి జిల్లా సిరిగపూర్ మండలం బీబీనాయక్ తండాకు చెందిన జాదవ్ సంతోష్కుమార్గా గుర్తించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బీసన్న తెలిపారు.
సూర్యాపేటలో 2.5 కిలోలు
సూర్యాపేట సిటీ : ఒడిశాకు చెందిన భిభూతి మండల్ సూర్యాపేటకు రెండు కిలోల గంజాయి తరలిస్తుండగా ఖమ్మం చౌరస్తాలో పట్టుకున్నట్లు ఎక్సైజ్ శాఖ సీఐ తిరుపతిరెడ్డి తెలిపారు. అలాగే రామకోటితండాకు చెందిన ధరావత్ నెహ్రూ నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐలు తిరుపతిరెడ్డి, వై.శ్రీనివాస్, ఏఎస్ఐలు పవన్కుమార్, కుమారస్వామి, సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.