స్వరాష్ట్ర సాధన కోసం సాగిన ఎన్నో చారిత్రక ఘట్టాలకు అడ్డాగా నిలిచింది పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ. సమైక్య రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమనేత, తెలంగాణ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పూరించిన పోరు శంఖంలో జిల్లా ప్రజలు వెన్నంటి నడిచారు. ఇరవై వసంతాల వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ప్లీనరీ తొలి సభకు నల్లగొండనే వేదికగా నిలిచింది. ఉద్యమ నినాదంలో కీలకమైన కృష్ణాజలాల్లో అన్యాయంపై కేసీఆర్ కదం తొక్కింది కూడా ఇక్కడి నుంచే.. 2004 తర్వాత కేంద్రంపై ఒత్తిడి కోసం తలపెట్టిన రాజీనామాల వ్యూహానికి కూడా నల్లగొండనే కేసీఆర్ వేదికగా చేసుకున్నారు. పాదయాత్రలు, బస్సుయాత్రలు, పల్లెనిద్రలు ఇలా ఎన్నో కార్యక్రమాలతో పాటు 2014లో రాష్ట్ర ఏర్పాటు సమయంలో సూర్యాపేటలో నిర్వహించిన సమరభేరి సభ వరకు ఎన్నో ఘట్టాలకు జిల్లా వేదికగా నిలిచింది. ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం తొట్టతొలిగా ప్రాణాలర్పించిన కాసోజు శ్రీకాంతాచారి కూడా ఇక్కడి వాడే కావడం గర్వకారణం. ఇక ఇదే సమయంలో ఎందరో సామాన్యులు సైతం దాడులు, దౌర్జన్యాలు, కేసులు, నిర్బంధాలు ఎదుర్కొంటూ కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి తమదైన ముద్రను వేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతూ జిల్లా ప్రజలు వెంటనడుస్తున్నారు. దీంతో
కేసీఆర్ సీఎం అయ్యాక నల్లగొండ జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సాగు,తాగునీటితోపాటు విద్య, వైద్య రంగాల్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. వెనుకబడిన జిల్లా నుంచి సమగ్రాభివృద్ధి దిశగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అడుగులు వేస్తున్నది.
ప్లీనరీకి ఉమ్మడి జిల్లా నుంచి 600 మంది ప్రతినిధులు
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి జిల్లా ప్రతినిధులు సిద్ధయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి 600 మంది ప్రతినిధులను ప్రత్యేకంగా ఇందుకోసం ఎంపిక చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 40 నుంచి 50 మంది వరకు మాత్రమే ప్లీనరికీ అనుమతిచ్చారు. ఇలా ఎంపికైన వారికి ఇప్పటికే ఫోన్లలో మెస్సేజ్లు పంపించారు. ప్లీనరీకి ఎంపిక చేసిన ప్రతినిధులకు ముందే వారి పేర్లతోనే కార్డులు కూడా ముద్రించి అందజేశారు. పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు పార్టీ మండల, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మార్కెట్ కమిటీ, పీఏసీఎస్ చైర్మన్లతోపాటు ఇంకా మరికొందరు సీనియర్ నేతలకు ప్లీనరీకి ఆహ్వానాలు అందాయి. వీరితోపాటు జిల్లా నుంచి మంత్రి జగదీశ్రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్, వివిధ కార్పొరేషన్లు, సంస్థల చైర్మన్లు కూడా హాజరుకానున్నారు. వీరంతా నేడు ఉదయం 11గంటల లోపు హైదరాబాద్ హైటెక్స్లోని ప్లీనరీ
ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్లీనరీలో
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. నేడు ఇరవై వసంతాల సంబురాలకు సిద్ధమైంది. ఇరవై ఏండ్ల ప్రస్థానంలో 13ఏండ్లు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత పాలన పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికగా మారింది. ఉద్యమ కాలంలో నినాదాలుగా ఉన్న ఎన్నో సమస్యలకు నేడు పరిష్కారం చూపుతూ ప్రజల గుండెల్లో చెరుగని ముద్రతో అతి పెద్దగా పార్టీగా అవతరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు ఆరున్నర లక్షల మంది సభ్యులతో ఎదురులేని శక్తిగా ఆవిర్భవించింది. ప్రతి ఆవాస ప్రాంతానికీ, మారుమూల తండాకు, ప్రతి బస్తీ, గల్లీకి సైతం గులాబీ జెండా విస్తరించింది. 2014 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయబావుటా. 2014లో ఆరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ.. 2018 ఎన్నికల్లో 10 ఎమ్మెల్యే స్థానాల్లో విజయపతాకం ఎగురవేసింది. ఉద్యమ కాలంతో పాటు స్వరాష్ట్ర సాధన అనంతరం కూడా కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలువడంలో నల్లగొండ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నాటి నుంచి నేటి వరకు జిల్లాలో సాగిన ప్రధాన ఘట్టాలను ఓ సారి మననం చేసుకుందాం.
20 ఏండ్లుగా టీఆర్ఎస్కే అంకితమైన శ్రీనివాస్ గౌడ్
సూర్యాపేట, (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై అభిమానం.. గుంటకండ్ల జగదీశ్రెడ్డితో ఉన్న అనుబంధంతో ఉద్యమ సమయంలో ఒడిదొడుకులు వచ్చినా పార్టీకి కట్టుబడి ఉండి 20 ఏండ్లుగా టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు నిమ్మల శ్రీనివాస్గౌడ్. ఉద్యమ సమయంలో 29 కేసులు, మూడు సార్లు జైలు జీవితం గడిపారు. రాష్ట్ర సాధన అనంతరం పాలన ప్రారంభించిన టీఆర్ఎస్లో మంత్రి జగదీశ్రెడ్డి గుర్తించి ఆయనను జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. రెండు సార్లు కౌన్సిలర్ టిక్కెట్ ఇస్తే తొలిసారి ఓటమి పాలైనా రెండోసారి శ్రీనివాస్ సతీమణి స్రవంతి గెలిచారు.
తెలంగాణపై ఉన్న అభిమానంతో 21 ఏండ్లకే మారోజు వీరన్న ప్రారంభించిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అర్వపల్లి మండలానికి చెందిన నిమ్మల శ్రీనివాస్గౌడ్ 2001లో స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో జగదీశ్రెడ్డి ద్వారా చేరారు. అదే సంవత్సరం స్వగ్రామం తిమ్మాపురంలో టీఆర్ఎస్ తరఫున సర్పంచ్గా బరిలో నిలిచి ఐదు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2005లో టీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా సెక్రటరీగా, 2007లో ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2009 నుంచి పదేళ్ల పాటు సూర్యాపేట పట్టణాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణపై అభిమానం.. సీఎం కేసీఆర్పై అపార నమ్మకం.. మంత్రి జగదీశ్రెడ్డితో ఉన్న ఉద్యమ అనుబంధంతో టీఆర్ఎస్ కుటుంబ సభ్యుడినయ్యానని శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ సాధించడంలోనే కాదు.. ప్రజలంతా మెచ్చుకునేలా పరిపాలన కొనసాగుతున్నదని చెప్పారు. మరో రెండు దశాబ్దాల వరకు ఏ పార్టీ టీఆర్ఎస్ దరిదాపుల్లోకి రాదన్నారు. తనకు పార్టీ, మంత్రి జగదీశ్రెడ్డి మంచి అవకాశాలు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.
అభివృద్ధి ప్రదాత
తెలంగాణ అభివృద్ధికై ఆరుగాలం కష్టపడిఅభివృద్ధి పరుగులు తీయిస్తున్న కృషీవలుడు
నోళ్లు తెరుచుకున్న బీళ్లకు నీళ్లిచ్చి దూప తీర్చిన అపర భగీరథుడు
దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న రుషితుల్యుడు
సరికొత్త పథకాలను ప్రజల దరిచేరుస్తున్న పయనీరు
దగాపడ్డ తెలంగాణకు తానే పెద్ద దిక్కుగా నిలిచిన స్వరమాంత్రికుడు
లోతుగా పాతుకుపోయిన కుళ్లు కుతంత్రాలకు అడ్డుకట్టలేస్తున్న అపర చాణిక్యుడు
తీరొక్క సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి రథసారథి
సకల జనులు సల్లంగుండాలని కళలుగంటున్న వెలుగు తార
కోట్లకొద్దీ మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణగా రూపురేఖలు దిద్దుతున్న మరో అశోకుడు మన కేసీఆర్…