.మోటకొండూర్, అక్టోబర్ 31 : నియోజకవర్గంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండడమే తన కోరిక అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కదిరేణిగూడెంలో గ్రామ సమన్వయకర్త జెట్ట మహేశ్వర్, సర్పంచ్ వేముల పాండు సహకారంతో సక్షమ్ తెలంగాణ, అలీ యావర్ జంగ్ జాతీయ భాషణ, శ్రవణ దివ్యాంగజన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అనే సంకల్పంతో సక్షమ్ తెలంగాణ, అలీ యావర్ జంగ్ జాతీ య భాషణ మరియు శ్రవణ దివ్యాంగజన్ సంస్థలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయ డం అభినందనీయమన్నారు. ఆయా సంస్థల సేవలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించాలని కోరారు. వైద్య శిబిరంలో వినికిడి, కంటి సమస్యలతోపాటు ఇతర వ్యాధులకు సైతం పరీక్షలు నిర్వహించి కావాల్సిన పరికరాలు, మందులను అందించడం గొప్పవిషయమన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు పథకం సక్షమ్ తెలంగాణ సంస్థ ద్వారానే సాధ్యమైందన్నారు. సంస్థలన్నీ ఒక గ్రూప్గా ఏర్పడి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. అదే విధంగా నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసమే ఆలేరులో డయాలసిస్ సెంటర్ను ఏర్పా టు చేశామన్నారు. అనంతరం ఆయా సంస్థల అధికారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, ఆయా సంస్థల కో ఆర్డినేటర్లు శ్రీదేవి, కరుణాకర్, వైద్యులు శ్రీనివాస్రావు, శివకుమార్, రాష్ట్ర ఈఎస్ఐ బోర్డు మెంబర్ వేముల మారయ్య, మండల వైద్యాధికారి రాజేందర్నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరోజు వెంకటాచారి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంత్రి రాజు, సర్పంచులు ఆడెపు విజయ, పైళ్ల వినోద, మమత పాల్గొన్నారు.
కేసీఆర్ పుణ్యంతోనే భగీరథ నీళ్లు..
సీఎం కేసీఆర్ పుణ్యంతోనే ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయని ప్రభుత్వ విప్ సునీత అన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటితో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయవద్దని స ర్పంచులకు సూచించారు. భగీరథ నీళ్లు ఆరోగ్యకరమైనవని, ఫిల్టర్ నీటి కంటే భగీరథ నీళ్లే మెరుగైనవన్నారు. భగీరథ నీటితో వాటర్ ఫిల్టర్లు ఏ ర్పాటు చేస్తే ఆడిట్ సమస్యలు వస్తాయన్నారు.