మోటకొండూర్, నవంబర్ 10 : ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని దిలావర్పూర్, ఇక్కుర్తి, చామాపూర్, కదిరేణిగూడెం, కాటేపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులకు నమ్మి మోసపోవద్దని, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. తాసీల్దార్ రాము, ఎంపీడీఓ వీరస్వామి, ఏఓ సుజాత, డీపీఎం సునీల్రెడ్డి, ఏపీఎం సత్యనారాయణ, సీసీలు మల్లేశ్, సంతోష, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రాజు, సర్పంచులు అమరేందర్రెడ్డి, వేముల పాండు, రైతు బంధు సమితి కన్వీనర్ ఐలయ్య పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలతో రైతులకు లబ్ధి
ఆలేరు రూరల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని కొల్లూరు, గొలనుకొండ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు కోటగిరి జయమ్మ, బైరపాక లక్ష్మి, మార్కెట్, పీఏసీఎస్ డైరెక్టర్లు గవ్వల నర్సింహులు, మారుపల్లి భిక్షపతి, సిద్ధులు, మామిడాల నర్సింహులు, గుంటి కృష్ణ, ఏఓ పద్మజ, ఏఈఓ నాగార్జున, రైతులు పాల్గొన్నారు.
మల్లాపురంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
యాదాద్రి : యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ప్రారంభించారు. ఎంపీటీసీ కర్రె విజయ, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ కర్రె సత్తయ్య, నాయకులు కర్రె వీరయ్య తదితరులు పాల్గొన్నారు.