పక్షులు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన వి. తెగుళ్లను నియంత్రించడంలో, పరపరాగ సంపర్కులుగా, చీడపురుగులను నివారిం చడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నా యి. అదనంగా వ్యవసాయ అమరికల్లో ఎరువులు అందించడంలోనూ తోడ్పడుతాయి. పక్షులు, పర్యావరణ వ్యవస్థ : అనేక పర్యావరణ వ్యవస్థల్లో పక్షులు స్పష్టంగా ముఖ్యమైన సభ్యులు. అవి ఆహార గొలుసులు, ఆహార చక్రాల్లో అంతర్భాగాలు. కొన్ని పక్షులు ఆహారాన్ని మొక్కల నుంచి పొందుతాయి. మరికొన్ని.. కీటకాలు లేదా వానపాములు వంటి చిన్న జంతువులను తింటాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పక్షులు కీలక పాత్ర పోషిస్తాయి. జీవవైవిధ్యాన్ని కాపాడడంలోనూ వీటి పాత్ర చాలా కీలకం.
ప్రధానంగా కనిపించే పక్షులు…
పిచ్చుక : పర్యావరణ సమతుల్యతలో దీని పాత్ర కీలకం. పిచ్చుకలు లద్దెపురుగులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ కీటకాలు పంటలకు అత్యంత ప్రమాదకరం. ఇవి పంటల్లో ఆకులు, పండ్లు, కాయలను తినడం ద్వారా తీవ్రనష్టాన్ని కలుగజేస్తాయి.
కాకి : ఇది సర్వభక్షకి. లద్దె పురుగులు, రెక్కల పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. అందుకే పురుగు ఉధృతిని తగ్గిస్తాయి.
మైనా, కోయిల : గాలిలో ఎగిరే పురుగులు, రెక్కల పురుగులను సులువుగా పట్టుకుని ఆహారంగా తీసుకుంటాయి.
కొంగ : మట్టిలో ఉండే పురుగులు, వాటి కోశస్థ దశలో ఉండే పురుగులను కూడా తినేస్తాయి. వాటి ద్వారా పురుగు జీవిత చక్రాన్ని అడ్డుకుంటాయి.
గద్ద : గద్దలు ఎలుకలను ఆహారంగా తీసుకుని వాటి ద్వారా జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
పక్షుల వల్ల కలిగే లాభాలు…
పక్షులు కీటకాలను తింటాయి. తోటలు, పొలాలు, ఇతర ప్రదేశాల్లో తెగుళ్లను నియంత్రించడంలో అవి సహజమైన మార్గం. గాలిలో ప్రయాణించే పక్షుల సమూహం నిత్యం వందలాది కీటకాలను సులభంగా తినగలవు. కీటకాలను తినే పక్షుల్లో బ్లూబర్డ్స్, వడ్రంగి పిట్టలు ముఖ్యమైనవి.
పక్షుల ప్రాధాన్యతను గుర్తించాలి
ఒకప్పుడు పక్షులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల కీటకాలు, పురుగులను తిని పంటలకు చీడ, పీడలు ఎక్కువగా రాకుండా కాపాడేవి. అలాగే సాగు చేసిన పంటలలో పరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు ఎక్కువగా సాధించేందుకు దోహదపడేవి. రానురాను అడవుల విస్తీర్ణం తగ్గడం, వేటాడడం, రేడియేషన్ వంటి ప్రభావంతో వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది.