కరీమాబాద్ ఏప్రిల్ 27 : డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాలను బంద్ చేశామని డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న తెలిపారు. ది వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్కు మద్దతు ఇస్తున్నామన్నారు.
ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏ ఇవ్వకుండా డీలర్లను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రభుత్వానికి సప్లై చేసిన ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏలు ఇస్తున్నాయి అన్నారు. ప్రైవేట్ డీలర్స్ సప్లై చేసే వాళ్లకు ఎఫ్ఓఏలు ఇవ్వడం లేదు అన్నారు. డీలర్స్ ని ఇబ్బంది పెట్టే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. అవసరం లేని లింక్ ప్రొడక్ట్ ను వెంటనే రద్దు చేయాలి డిమాండ్ చేశారు. వెంటనే ఎరువుల కంపెనీలు సరైన నిర్ణయం తీసుకోపోతే రాష్ట్రవ్యాప్తంగా బంద్ ను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.