నందికొండ: ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలనుచేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగుల కు గాను పూర్తి సామర్ధ్యంతో నీరు నిల్వ ఉంది.
రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9217 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 6870 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూ సెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 28217 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
అదేవిధంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 78804 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుండగా అదే స్థాయిలో ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 883.00 అడుగులు (204. 7889 టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 47948 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది.