అయిజ, మార్చి 23 : నడిగడ్డలో ప్రజా నేతగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్ సీనియర్ నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో మంగళవారం హైదరాబాద్లోని యశోద దవాఖానలో చేరగా.. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను చేపట్టారు. ఆయన మృతితో నడిగడ్డతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్, ఏపీ, కర్ణాటకలోని పలు జిల్లాల ప్రజలు శోకసంద్రంలో మునిగారు. తిరుమల్రెడ్డి మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. కాగా గురువారం ఉత్తనూర్లో తిరుమల్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా ఆయన అవయవాలను జీవన్ధాన్ ట్రస్ట్కు దానం చేశారు.