“ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంది. అందుకే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు’ అని చెప్పింది కృతిశెట్టి. ఆమె సుధీర్బాబు సరసన కథానాయికగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు.
ఆదివారం కృతిశెట్టి పాత్రికేయులతో ముచ్చటిసూస్తూ..‘కెరీర్ ఆరంభంలోనే ద్విపాత్రాభినయంలో నటించడం ఆనందంగా ఉంది. సినిమాలోని అఖిల పాత్రను చాలా మంది ఇష్టపడుతున్నారు. మరో పదేళ్ల పాటు నా క్యారెక్టర్ గుర్తుండిపోతుందని ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్లో నటించాలనుంది. ప్రతి సినిమాకు నేను హోమ్వర్క్ చేస్తాను. పాత్రకు సంబంధించిన వివరాల్ని రాసి పెట్టుకొని ప్రిపేర్ అవుతాను. అలాంటప్పుడే అనుకున్న విధంగా అభినయించడం సాధ్యమవుతుంది’ అని చెప్పింది.