భువనగిరి అర్బన్, డిసెంబర్ 1: ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడంతో పాటు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు వైద్య సిబ్బందికి సూచించారు. పట్టణంలోని వెటర్నరీ ఆస్పత్రి హాల్లో బుధవారం నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి ప్రజల్లో భయాందోళనలు పోగొట్టాలన్నారు. పీహెచ్సీల ఆధ్వర్యంలో ప్రజలు, వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించి ధైర్యం ఇవ్వాలన్నారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నివారణాధికారి పాపారావు, డీఎంఓ రామారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీ
వలిగొండ : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో పీహెచ్సీ సిబ్బంది అవగాహన ర్యాలీ తీశారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు పవన్, వీణ, సిబ్బంది ఆళ్ల సంతోష్ కుమార్, అనూరాధ, శ్రీనివాస్, శౌరి, కోమలి, ప్రీతంబాబు, సుశీల పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : పట్టణంలోని జాగృతి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాధి నిర్ములనపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి.సూర్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మనిపాల్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి పి.వెంకటేశ్, సునీతరెడ్డి, బస్వరాజు పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండల వైద్యాధికారి నరేశ్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది యాకయ్య, వనజాత, నర్సయ్య, నాగమణి, విజయ, లలిత, వెంకటరమణ పాల్గొన్నారు.
రామన్నపేట : మండలకేంద్రంతో పాటు కక్కిరేణి గ్రామంలో జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్స్పాల్ శివకోటి, ఎన్ఎస్ఎస్ ప్రోగామ్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి, వేముల శేఖర్, వేణుగోపాల్, జీవిరావు, శ్రీనివాస్, సులోచన, కరుణ, మమత, సైదులు,కేతమ్మ పాల్గొన్నారు.