నారాయణపేట టౌన్, నవంబర్ 26 : భారత రాజ్యాం గ పరిరక్షణకు కట్టుబడి ఉంటూ, అందులోని మూల సూ త్రాల ఆధారంగా నడుచుకోవాలని కలెక్టర్ హరిచందన సూ చించారు. శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులందరూ భారత సంవిధానాన్ని చదివించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాం గ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జిల్లా ప్ర జాపరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం ఉద్యోగులచే రాజ్యాంగ ప్రవేశికపై ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మెర్సీ వసంత అధ్యక్షతన రాజనీతి శాస్త్రం, ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పాలమూరు విశ్వవిద్యాలయం సహా ఆచార్య డాక్టర్ భూమయ్య హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు లక్ష్మణాచారి, భాస్కర్రెడ్డి, సంధ్యారాణి, అధ్యాపకు లు పాల్గొన్నారు. సింగార్భేస్లోని సరస్వతి శిశుమందిర్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ఊట్కూర్, నవంబర్ 26 : మండలంలో 72వ రాజ్యాం గ దినోత్సవ వేడుకలను శుక్రవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల, పా ఠశాలల వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సా హెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహిం చి ఘన నివాళులర్పించారు. స్థానిక అంబేద్కర్ కూడలిలో బీఎస్పీ, డీఎస్పీ, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సేవలను కొనియాడారు. నిడుగుర్తి యూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డి ఆ ధ్వర్యంలో విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో అలరించారు. చిన్నపొర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాసం పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బీఎస్పీ, డీఎస్పీ, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
జాజాపూర్ ఉన్నత పాఠశాలలో…
నారాయణపేట రూరల్, నవంబర్ 26 : మండలంలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాం గ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు రాజ్యాంగ ప్రవేశికపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తీలేరు సర్పంచ్ ఆధ్వర్యంలో…
మరికల్, నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మం డలంలోని తీలేరు సర్పంచ్ రేవతమ్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోని పౌరులందరికీ సమాన హక్కు లు కల్పించాలనే లక్ష్యంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. కార్యక్రమంలో నాయకులు, గ్రా మస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో…
మాగనూర్, నవంబర్ 26 : మండలంలోని వివి ధ ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో శుక్రవా రం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయం లో సుధాకర్రెడ్డి భారత రాజ్యాంగ ప్రవేశికను గ్రామ కార్యదర్శుల ద్వారా చదివి వినిపించారు. భారత రా జ్యాంగ ప్రవేశిక ప్రజల రోజువారీ జీవితంలో భాగం కావాలని ఎంపీడీవో సుధాకర్రెడ్డి తెలిపారు. కార్యక్ర మంలో కార్యాలయ సిబ్బంది, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో…
దామరగిద్ద, నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ న ర్సప్ప, ఎంపీడీవో శశికళ, తాసిల్దార్ వెంకటేశ్, ఎంపీవో రా మన్న తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో…
ధన్వాడ, నవంబర్ 26 : ధన్వాడ, కిష్టాపూర్లో శుక్రవా రం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కిష్టాపూర్లో టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కేక్కట్ చేశారు. ధన్వాడలోని అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ ఆధ్వర్యంలో భారత రా జ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు, రాష్ట్ర అధ్యక్షు డు పరమేశ్వర్, జిలా అధ్యక్షుడు బాలరాజు, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్
కోస్గి, నవంబర్ 26 : స్థానిక చౌరస్తాలో రాజ్యాంగ ని ర్మాత అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ తాలుకా అధ్యక్షుడు ఈస్వప్ప, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సం ఘం సభ్యులు, కార్యనిర్వాకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలలో…
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ శుక్రవారం మెడికల్ కళాశాలలో వైద్య అధికారులు, వైద్య విద్యార్థులు ప్రవేశికపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునందిని, హెచ్వోడీ నవాకళ్యాణి తదితరులు పాల్గ్గొన్నారు.