వేములవాడ రాజన్నకు ముస్లిం దంపతులు కోడెమొక్కు చెల్లించారు. కరీంనగర్కు చెందిన యాకు, ఖాసిం దంపతులు గురువారం వేములవాడ రాజన్న ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు ఆలయ ఆవరణలోని దర్గా వద్ద ప్రార్థనలు చేశారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో హుండీని గురువారం లెక్కించారు. 74 రోజుల హుండీని లెక్కించగా రూ.75,44,354 ఆదాయం సమకూరింది. దీంతోపాటు 144 గ్రాముల మిశ్రమ బంగారం, 11 కిలోల మిశ్రమ వెండి, 1,300 కిలోల మొక్కుబడి బియ్యం, 78 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్టు ఈవో ఏ బాలాజీ తెలిపారు.