నల్లగొండ : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం సాయంత్రమే అధికారులు ఏ క్షణమైనా నా మూసి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 643.50 అడుగులు చేరగా.. ఎగువ నుంచి వరద పెరుగుతుండడంతో శనివారం మూడు గేట్లను ( 2వ, 4వ ,11వ) రెండు ఫీట్ల మేరకు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 4,750 క్యూసెక్కుల నీటిని మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. మూసి పరీవాహక గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని, నది వైపు వెళ్లొద్దంటూ అధికారులు సూచించారు. ఇప్పటికే మూసి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటి విడుదల కొనసాగుతున్నది.