మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని పోచారం మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ సరిత కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది అనుచరుతో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి వీరంతా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి చామకూర మల్లారెడ్డి వీరందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.