ములుగురూరల్, నవంబర్14 : ములుగు ఎమ్మెల్యే సీతక్క నిజమైన ఆదివాసీ బిడ్డ కాదని, ఆమె గిరిజన దొరసానిగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. మంగళవారం మండల ఎన్నికల ఇన్చార్జి, రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డితో కలిసి నాగజ్యోతి చింతలపల్లి, పొట్లాపూర్, పత్తిపల్లి, చింతకుంట, కొడిశలకుంట, చిన్నగుంటూరుపల్లి, పులిగుండం, జగ్గన్నపేట, సారంగపల్లి, భాగ్యతండా, జీవంతరావుపల్లి, మహారాజ్పల్లి, బండారుపల్లి, అన్నంపల్లి, దేవగిరిపట్నం గ్రామాల్లో రాత్రి వరకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో వేల కోట్ల కాంట్రాక్టులు చేసి అక్కడి డబ్బును తెలంగాణలోని 30 నియోజకవర్గాల్లో పంచుతున్నారన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ము లుగు నియోజకవర్గ ప్రజలతో పాటు తన సొంత ఊరికి చేసింది ఏమీలేదన్నారు.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేది సీతక్క కాదని, రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ అన్నారు. విప్లవ కారుడి బిడ్డనైన నాకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచి అవకాశం ఇవ్వడాన్ని ఓర్వలేక ఢిల్లీ నుంచి తెలంగాణ ద్రోహులతో పాటు ఓటుకు నోటు దొంగ అయిన రేవంత్రెడ్డిని పిలిపించుకున్నదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో పాటు కార్పొరేషన్ చైర్మన్లు తెలంగాణలో పుట్టిన బిడ్డలన్నారు. ఢిల్లీ నాయకులకు గులాములుగా పనిచేస్తు న్న సీతక్కకు వారిని విమర్శించే నైతిక హక్కులేదన్నారు. గిరిజనులు, గిరిజనేతలకు పోడు పట్టాలు అందే బా ధ్యత తాను తీసుకుంటానని నాగజ్యోతి తెలిపారు. సీతక్క తన సొంత గ్రామమైన జగ్గన్నపేటను అభివృద్ధి చేయలేదని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం తాను పుట్టి పెరిగిన కన్నెపల్లిలా జగ్గన్నపేటను చూసుకుంటానని నాగజ్యోతి అన్నా రు. గ్రామంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుగోడలా ఉన్న సీతక్కను ఓడించాలని, నిరుపేద గిరిజన బిడ్డనైన తనను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
24గంటల కరెంట్ కావాలో.. 3గంటల కరెంట్ కావాలో..? ఇంటింటికీ రూ.5లక్షల బీమా కావాలో.. లేక ఇ బ్బందులు పెట్టే కాంగ్రెస్ కావాలో ప్రజ లు ఆలోచించుకోవాలని రెడ్కో చైర్మన్, మండల ఎన్నికల ఇన్చార్జి సతీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దని, ప్రజల యోగక్షేమాలను చూసే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ వెంట నడువాలని కోరారు. నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారం లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, పత్తిపల్లి ఎంపీటీసీ నూనావత్ మహేష్నాయక్, ఉప సర్పంచ్ వెంగల్రావు, నాయకులు వేములపల్లి భిక్షపతి, వెల్పూరి సత్యనారాయణరావు, సానికొమ్ము ఆదిరెడ్డి, రమేశ్రెడ్డి, రఘు, నగేశ్, అజార్, మహేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ తన తండ్రి అజ్మీరా చందూలాల్కు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిచిన అనంతరం మంత్రి పదవి ఇచ్చాడని మాజీ మంత్రి, దివంగత నేత చందూలాల్ తనయుడు అజ్మీరా ధరమ్సింగ్ అన్నారు. తన తండ్రి చనిపోయే వరకు బీఆర్ఎస్ జెండా కింద ఉంటే తన సోదరుడు అజ్మీరా ప్రహ్లాద్ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీలో చేరి పార్టీని చీల్చాలని చూస్తున్నాడని అన్నారు. తన తండ్రి అడుగు జాడలో నడిచేందుకు తాను బీఆర్ఎస్లోనే ఉండి నాగజ్యోతి గెలుపునకు కృషి చేస్తున్నానన్నారు.