ములుగు, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని సూచించినా గెలు పే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలో ములుగు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం సూచించిన అభ్యర్థికి ఎంపీటీసీలందరూ బాధ్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధిష్టానం సూచనలే శిరోధార్యమని, ఇక్కడ ఎవరి సొంత ఎజెండాలకు తావులేదని అన్నారు. టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి సోమవారం నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరుకావాలని సూచించారు. సమావేశంలో జడ్పీవైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్రామ్నాయక్, ములుగు జడ్పీటీసీ సకినాల భవాని, వెంకటాపూర్, ఏటూరునాగారం, గోవిందరావుపేట ఎంపీపీలు బుర్ర రజిత, అంతటి విజయ, సూడి శ్రీనివాస్రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీ ణ్, లింగాల రమణారెడ్డి, గడదాసు సునీల్కుమార్, సూరపనేని సాయిబాబు, అనిశెట్టి రమేశ్, ఎంపీటీసీలు మాచర్ల ప్రభాకర్, తొగరి అశోక్, ఆలూరి శ్రీనివాస్రావు, సర్పంచ్ రేగూరి రవీందర్రెడ్డి, నాయకులు భాషబోయిన పోశా లు, చీకుర్తి మధుయాదవ్, భమాండ్లపల్లి అనిల్, నాగరాజు, తుమ్మ మల్లారెడ్డి, కోట నర్సింహులు, ఎండీ ఖాజాపాషా పాల్గొన్నారు.