బండ్లగూడ : డయాగ్నోస్టిక్ సెంటర్లు తక్కువ ఖర్చుతో పరీక్షలు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎంపీలు సంతోషకుమార్, రంజిత్రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం అత్తాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ను వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహకులు డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాల గురించి వివరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం నిరు పేదలకు మెరుగైన వైద్యం అందించమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్,టీఆర్ఎస్ నాయకులు శ్రీరాంరెడ్డి,సురేందర్రెడ్డి,అమరేందర్ తదితరలు పాల్గొన్నారు.