ఉప్పల్జోన్ బృందం, డిసెంబర్ 7: హరితస్ఫూర్తిని కొనసాగిస్తూ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. రాజ్యసభసభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ జన్మదినం సందర్భంగా మంగళవారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్తో కలిసి పలువురు మొక్కలు నాటారు. అనంతరం ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రజలలో చైతన్యం తీసుకువస్తుందన్నారు.
పలువురు నేతలు ఎంపీ సంతోష్కుమార్ను కలిసి మొక్కలు అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గానికి చెందిన పలు డివిజన్ల నేతలు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యుడు పన్నాల దేవేందర్రెడ్డి, శాంతిసాయిజెన్ శేఖర్, బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, బొంతు శ్రీదేవి, ప్రభుదాస్, స్వర్ణరాజ్, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, గంధం జ్యోత్న్సనాగేశ్వర్రావు, కొత్త రామారావు, ధన్పాల్రెడ్డి, నేతలు గడ్డం రవికుమార్, గుండారపు శ్రీనివాస్రెడ్డి, వేముల సంతోష్రెడ్డి, పల్లె నర్సింగ్రావు, కాసం మహిపాల్రెడ్డి, ముస్తాక్, మేకల ముత్యంరెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, చింతల నర్సింహారెడ్డి, పిట్టల నరేశ్, పలువురు నేతలు పాల్గొన్నారు.