హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో సినీ నటుడు మనోజ్ నందం పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మనోజ్ నందం మాట్లాడుతూ.. గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, వీలైనన్ని మొక్కలు నాటాలని ఆయన కోరారు.అనంతరం తన స్నేహితులు తనీష్, ధనరాజ్, యాంకర్ గీతా భగత్ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.