అగస్త్య, నక్షత్ర జంటగా సురేఖ ప్రొడక్షన్స్ పతాకంపై నందిగం వెంకట్ నిర్మాతగా దర్శకుడు నానాజీ మిరియాల రూపొందిస్తున్న సినిమా ‘బాపట్ల ఎంపీ నందిగం సురేష్’. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నందిగం వెంకట్ మాట్లాడుతూ…‘సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి ప్రజాదరణ పొంది బలమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్ర కథాంశం.
ప్రజా జీవితంలో అతను ఎదిగే క్రమంలో ఎదురైన ఆటంకాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు అనేది సినిమాలో చూపిస్తున్నాం’ అన్నారు. దర్శకుడు నానాజీ మిరియాల మాట్లాడుతూ…‘ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే జీవితంలో ఎదుగుతాం అని చెప్పే చిత్రమిది. ప్రతి సామాన్యుడు చూసి స్ఫూర్తి పొందే విధంగా సినిమా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : అనూప్ రూబెన్స్.