యాదాద్రి భువనగిరి : మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్గా యాకుబ్రెడ్డి, వైస్ చైర్మన్గా ముగల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారికి మంత్రులు అభినందనలు తెలిపారు.