వెంగళరావునగర్, డిసెంబర్1: తల్లితో పాటు పిల్లలు అదృశ్యమైన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం…బోరబండ ఎన్ఆర్ఆర్పురం సైట్-3కు చెందిన ఆకుల శంకర్ ఓ ప్రైవేటు సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం తన పెద్ద కుమారుడు పాఠశాలకు రాలేదని పాఠశాల నుంచి సందేశం రావడంతో ఇంటికి వెళ్లి చూశాడు. ఇంట్లో భార్య శ్రావణి(27),కుమారులు శంకర్(7), నిహిత్(4) కూడా కనిపించకపోవడంతో పక్కింటి వారిని అడగగా శ్రావణి వారాసిగూడలోని తన తల్లి వద్దకు వెళ్తున్నట్లు చెప్పిందని వారు తెలిపారు. దీంతో శంకర్ వారాసిగూడలోని తన అత్తింటికి వెళ్లాడు. అక్కడికి తన భార్యాపిల్లలు రాలేదని తెలుసుకుని వారి ఆచూకీ కోసం అంతటా గాలించారు. ఫలి తం లేకపోవడంతో బుధవారం ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.