కాజీపేట: వడ్డేపల్లి చెరువులో దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన వాకర్స్ వారిని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని జూబ్లీ మార్కెట్కు చెందిన రాజ్యలక్ష్మి (30) కుటుంబంతో నివాసముంటుంది. ఇంట్లో గొడవలు జరగడంతో మానసికంగా కృంగి పోయిన రాజ్యలక్ష్మి చనిపోవాలని నిర్ణయం తీసుకొని సోమవారం తన చిన్న కూతురును తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
ఉదయం వడ్డేపల్లి చెరువులోకి దిగుతుండగా అక్కడే వాకింగ్ చేస్తున్న కురుమని మహేందర్ రెడ్డి చూసి తోటి వాకర్స్ పాడి ప్రకాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, రంగారావు, తదితరుల సహకారంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. అనంతతరం వారిని కాజీపేట పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.