హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11: హనుమకొండలో టెన్నిస్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్ఖాన్ అన్నారు. సోమవారం హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్లో టెన్నిస్ గ్రౌండ్లో పంద్రాగస్టు టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అజీజ్ఖాన్ మాట్లాడుతూ జేఎన్ఎస్లోని టెన్నిస్ కోర్టులో ఫ్లడ్ లైట్లు, కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వరంగల్ జిల్లాను క్రీడా హబ్గా ఏర్పాటు చేయాలని సంకల్పించిందని, త్వరలోనే హనుమకొండలో స్పోర్ట్స్స్కూల్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నల్ల సురేందర్రెడ్డి, ప్రొఫెసర్ ఎర్రగట్టుస్వామి మాట్లాడుతూ జిల్లాలోని ఔత్సాహిక క్రీడాకారులను వెలుగులో తీసుకొచ్చేందుకు హనుమకొండలో ప్రతినెల ఒక టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలో ప్రథమ బహుమతి నాగయ్య(ఏసీపీ), శ్రీధర్(ఆర్ఐ) జోడి ప్రథమ స్థానంలో నిలవగా, శివరాజ్, రోహిత్ జంట ద్వితీయ స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఏసీపీ అంబటి నర్సయ్య, పాటర్న్ కె.రవిచంద్ర, కోశాధికారి సిరికొండ సుదర్శన్, ఉపాధ్యక్షులు కుంజు బిహారి, వెంకట్ నారాయణ, మల్లారెడ్డి, పెరుమాండ్ల వెంకట్, వినీల్, సాత్విక్, శివరాజ్, వినయ్వర్ధన్రెడ్డి, కార్తీకుమారి, రడం శ్రీనివాస్ ఉన్నారు.