ఖమ్మం నవంబర్ 29 : ప్రధాని మోదీ పతనం ప్రారంభమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలో సీపీఎం జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. తమ్మినేని ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. కార్మిక, కర్షకుల ఐక్యపోరాటాలతోనే నల్లచట్టాలు రద్దయ్యాయని అన్నారు. కేంద్రం గుడ్డిగా చట్టాలు చేయడంతో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతోన్మాదం పెరిగిందని విమర్శించారు. నగరీకరణ పథకంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం పూనుకొంటున్నదని విమర్శించారు. సాగు చట్టాల రద్దు స్ఫూర్తితో పోరాడి కేంద్రం చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.